Home / ANDHRAPRADESH / కనక దుర్గ గుడిలో అపచారం…. తాకట్టులో దుర్గమ్మ మంగళసూత్రం

కనక దుర్గ గుడిలో అపచారం…. తాకట్టులో దుర్గమ్మ మంగళసూత్రం

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు నుంచి మంగళసూత్రాలను విడిపించినట్లు సమాచారం.

అయితే ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బయటపెట్టడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. మరోవైపు ఈ అంశం తన దృష్టికి రాలేదని ఆలయ ఈఓ సూర్యకుమారి చెబుతున్నారు. అ సంఘటనపై విచారణ జరుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే దుర్గ గుడిలో అధికారుల తీరు పలు వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో తాళిబొట్టు మాయమైన అంశం మరో వివాదంగా మారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat