ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జోరుగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయత్రలో జనం నుండి స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో చేపట్టిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాల్గోవ రోజు కడప జిల్లాలో సాగుతోంది. ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జాబు మాటే మర్చిపోయారని విమర్శించారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు, లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారని, అయితే వాటి గురించే మాట్లాడటం లేదని అన్నారు.ఆంధ్రప్రదేశ్ యువత ఒక ఏడాదిన్నర ఓపికపట్టాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఇస్తానన్న లక్షా 42 వేల ఉద్యోగాలు తాను ఇస్తానని వ్యాఖ్యానించారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.2 వేల రూపాయలు చేస్తానని హామీఇచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని అన్నారు. సుమారు ఆరు నెలల పాటు ఏపీలో 125 నియోజకవర్గాల మీదుగా జగన్ ప్రజా సంకల్పయాత్ర సాగుతుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. సుమారు 3 వేల కిలోమీటర్లు జగన్ నడవనున్నారు.
