ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. దగా పడిన జనం నుంచి ఒకటే మాట.. అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి..అంటూ సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి తన యాత్రను ఆరంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ అక్కడి నుంచి 10.00 గంటలకు పరిటాల టీడీపీ కంచుకోట రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మద్యాహ్నం 3 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్ జగన్ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
