కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్బాషా, రఫీ, చిన్నా, ఇదుర్సా, రాజా హుస్సేన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ అధికారంలోకి వస్తుందని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మనమందరం జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చేయ్యడానికి మన నియోజక వర్గం నుండి అత్యదిక ఓట్లు వేసి గెలిపిద్దాం అని కార్యకర్తలు కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు.
