ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఘర్షణ పడ్డారు. తూర్పు విభాగం ఏసీపీ విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఉంగుటూరు పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. సర్పంచ్ భర్తపై ఉంగుటూరు పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
