అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాక జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులకు తెలిపారు.
