Home / ANDHRAPRADESH / వైసీపీలోకి ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత..!

వైసీపీలోకి ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత సత్యనారాయణ గురువారం వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో సత్యనారాయణ, ఆయన మద్దతుదారులను వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.విశాఖలో వైసీపీ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. వైఎస్‌ జగన్‌ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్టు చెప్పారు. మరికొంతంమంది కూడ వైసీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat