కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి.
ఇటీవలనే కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు గౌరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రేడ్యూనియన్ రమణ మరియు రాఘవేంద్ర సమక్షంలో వైసీపీ లో చేరిన వివిధ వార్డులలోని 100 మంది పైగా యువకులు. అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు టీడీపీ పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నట్లు సమచారం.