వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్క్లాక్ వద్ద జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్ఐలు శివగంగాధర్రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి జీపులో తరలిస్తుండగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసు వాహనం కార్యకర్తలపై దూసుకెళ్లింది. ఆగ్రహానికి గురైన నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆందోళనకారులను పోలీస్స్టషన్కు తరలించారు. పోలీస్స్టేషన్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు మీడియాతో మాట్లాడారు. ఎస్టీలు పిట్పాకెట్లు కొట్టేవాళ్లని చెప్పడం జేసీ అహంకారానికి నిదర్శనమన్నారు. దివాకర్రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నట్లు తెలిపారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత జేసీకి లేదన్నారు. నిన్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తే వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ రాజారెడ్డి కాళ్లు పట్టుకున్న సంగతి మరిచిపోయావా…? అని ప్రశ్నించారు.
గతంలో తాడిపత్రిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పరిటాల సునీత వస్తే ఆందోళన చేశారని, ఈరోజు అలాంటి వారి పంచన చేరి సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. మరోసారి వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. అంతేకాదు వైఎస్ కుటుంబాన్ని గానీ, వైఎస్ జగన్ను గాని వ్యక్తిగతంగా విమర్శిస్తే నాలుక కోస్తామని ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు వద్ద లబ్ధిపొందాలనుకుంటే నాలుగు గోడల మధ్య కాళ్లు పట్టుకోవాలని సూచించారు. గద్వాల్లో దొంగతనాలు చేస్తుంటే అక్కడ తరిమికొడితే జూటూరుకు వచ్చిన జేసీ.. ఇక్కడి రైతుల భూములు లాక్కున్నారన్నారు. జేసీ అరాచకంతో తాడిపత్రి నియోజకవర్గంలో తాళులు తెగిన మహిళలను అడిగితే జేసీ దివాకర్రెడ్డి చరిత్ర తెలుస్తుందన్నారు.