ఏపీలో చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి . 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పారు. 180 రోజు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలో కలిసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ వాఖ్యలు చేశాడు. ఇంకా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు….ఈ ఏడు జిల్లాల్లో వైసీపీకి 77కు పైగా సీట్లు గెలుస్తుదంని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబువి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని…గడిచిన 4 ఏళ్లలో టీడీపీ నై అత్యంత దారుణంగా ప్రజల్లో వ్యతీరేకత పెరిగిందన్నారు. త్వరలోనే ఏపీలో తెలుగు కాంగ్రెస్ అనే కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో కలిసిపోతోందన్నారు.
