ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటనలో మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చంద్రబాబు జిల్లా పర్యటనలో మంత్రి అఖిల అడ్రస్ లేదు. ముఖ్యమంత్రి పర్యటనకే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్యటనను బహిష్కరించినట్లే అనుకోవాలి.ఇపుడా వ్యవహారంపైనే జిల్లా టిడిపి నేతల మధ్య చర్చలు జరుగుతోంది.
అఖిలప్రియ ప్రవర్తనకు కారణమేంటి ?
2014 ఎన్నికల సందర్భంగా తల్లి శోభా నాగిరెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యింది. తర్వాత తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు వైసీపీలో నుండి టీడీపీలోకి ఫిరాయించింది. కాని కొంత కాలానికే తండ్రి కూడా చనిపోయారు. వెంటనే చంద్రబాబు మంత్రిని చేశారు. అంటే, చిన్నపుడే ఎమ్మెల్యే అయిపోవటమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు. అసలే ఫ్యాక్షన్ నేపధ్యమున్న కుటుంబం నుండి వచ్చింది. నోటికి అడ్డులేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా సరిగా తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడినా తల్లి, దండ్రులను చూసి ఊరుకునే వారు. అటువంటి పరిస్ధితుల్లో కొద్ది కాలం తేడాలోనే ఇద్దరూ చనిపోవటంతో ఏం చేయాలో అర్ధం కాలేదు. దానికితోడు తండ్రిని నీడలా అంటిపెట్టుకుని ఉన్న ఏవి సుబ్బారెడ్డి లాంటి వారితో గొడవలు మొదలయ్యాయి.
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. బ్లాస్టింగ్ న్యూస్..!
తండ్రి భూమా నాగిరెడ్డికున్న ఫ్యాక్షన్ నేపధ్యం జిల్లాలో అందరికీ తెలిసిందే. దాని వల్లే జిల్లాలో రాజకీయంగా బలమైన కుటుంబాలతో పడదు. టిడిపిలోనే ఉన్న ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుటుంబంతో పడదు. శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ కుటుంబంతో సఖ్యత లేదు. అఖిల మంత్రైన తర్వాత కూడా పై కుటుంబాలతో శతృత్వం కొనసాగిస్తున్నట్లే కనబడుతోంది. అంతెందుకు స్వయానా మేనమామ, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితో కూడా మంత్రికి పడటం లేదు. తన వ్యవహారశైలి వల్లే అందరినీ మంత్రి దూరం చేసుకుంటోంది. ఆ ప్రభావం శాఖపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లోనే మంత్రిలో అభద్రత మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో టిక్కెట్టు వస్తుందో రాదో అన్న అనుమానాలు మొదలైంది.
ఏవితో గొడవలు..!
సీనియర్ నేత ఏవితో మంత్రికి కుటుంబపరమైన వివాదాలున్నాయ్. ఆ పంచాయితీ తేలకపోయేసరికి ఏవిపై మంత్రి
కత్తికట్టింది. ఆ పంచాయితీ తేలేది కాదు కాబట్టే ఏవి కూడా మంత్రికి దూరమైపోయి ఎదురుతిరిగారు. దాంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయిన భగ్గుమంటోంది. అందుకనే రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకుంటున్నాయ్. వచ్చే ఎన్నికల్లో మంత్రిని కాదని ఆళ్ళగడ్డలో తనకే టిక్కెట్టు కావాలని ఏవి పట్టుపట్టారు. పార్టీలో మంత్రంటే పడని నేతలందరూ మద్దతుగా నిలబడటంతో ఏవి బలమైన పోటీదారుగా మారారు. దాంతో ఏం చేయాలో అఖిలకు అర్ధం కావటం లేదని తెలుస్తుంది.
ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??