ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ప్రజలు జగన్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక వైసీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో సోమవారం వైఎస్సార్ సీపీ లో చేరారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో కామరాజుపేట గ్రామ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ శింబోతుల తాతారావు, అద్దిపల్లి అప్పారావు, సేనాపతి జానకి, బొడ్డపాటి వెంకటరమణ, ఎలగశెట్టి పెద్ద, శీరంశెట్టి అప్పారావు, అరిశే లోవరాజు, గుర్రం పెద్ద, మట్టా సత్తిబాబు, ఎలగశెట్టి సూరిబాబు, దశరథ రామకృష్ణ, ఎలుగుల శ్రీను, తదితరులు చేరారు. వీరికి చంటిబాబు పార్టీ కండువాలు చేశారు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో ముమ్మన అర్జునరావు, శింబోతుల శ్రీను, గండ్రేడ్డి త్రిమూర్తులు, పినగోల వెంకటరమణ, నీలపల్లి సత్యనారాయణ, విరోతుల చంద్రరావు, కట్టమూరి బంగారం తదితరులు పాల్గొన్నారు
