ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో ఉదయం ఉమాకాంత, శంకర్ అనే అతను వాదులాడుకొన్నారు. తర్వాత సద్దుమణిగారు. కృష్ణాష్టమి సందర్భంగా వైసీపీ నాయకులు పూజలు చేయడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. గుడి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా శంకర్ వర్గీయులు ఇళ్ల పైనుంచి రాళ్లతో దాడి చేశారు. ఘర్ణణలో బాబు తలపై కత్తితో నరికి గాయపరిచారు. రాళ్ల దాడిలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. బాబు పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. రూరల్ సీఐ ఆదినారాయణ, తవణంపల్లె ఎస్ఐ ఉమామహేశ్వర రావు కొత్తగొల్లపల్లెకు చేరుకొని పికెట్ ఏర్పాటు చేశారు. తవణంపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
