గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీపినీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు తాను వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈనెల 26లేదా 27 తేదీల్లో జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు తేదీలను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు పార్టీ అధినేత వై.ఎస్. జగన్ సమక్షంలో తాను వైసీపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. బాలినేనితో సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. బాలినేని, మాజీ ఎంపీ వైవీ సహకారంతో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.
