Home / 18+ / కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!

కలకలం రేపుతున్న పసికందుల విక్రయాలు.!

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీ.జీ.హెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో జోరుగా పిల్లల విక్రయాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి.గర్భిణీలు వదిలి వెళ్ళిపోయినా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల వదిలేద్దామనే మహిళలకు వలవేస్తున్న ఆ ఆసుపత్రికి చెందిన సెక్యూరిటీలో కొందరు సిబ్బంది వల వేసి వారి వద్ద నుంచి పసికందులను సేకరించి ఆడ బిడ్డకు ఓ రేటు మగ బిడ్డకో రేటు చప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదే కోవలో జీజీహెచ్ లో సెక్యూరిటీ సెక్షన్ లో పనిచేస్తున్న నాగమణి అతని భర్త ప్రసాద్ ఏలూరుకు చెందిన ఓ రిటైర్డ్ ఎస్సై వద్ద సుమారు 60వేలు తీసుకుని మగ బిడ్డను విక్రయించినట్లు సమాచారం.ఆ బిడ్డ m.సత్య అనే మహిళకు 23-07-18 వ తేదీన పుట్టిన బిడ్డగా జీజీహెచ్ రికార్డుల్లో నమోదయినట్లుగా తెలుస్తుంది.జీజీహెచ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విక్రయాల వ్యవహారం జరగడం వాస్తవమేనని ఇది మా దృష్టికి వచిందని అయితే ఈ విక్రయాలు ఆసుపత్రిలో జరిగి ఉండకపోవచ్చు బయట జరిగి ఉంటాయని అనుకుంటున్నామని కాకినాడ జీజీహెచ్ సూపరింటిండెంట్ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టి ,ఆరోపణలు నిజమని తేలితే సెక్యూరిటీ సిబ్బంది నాగమణి ఆమె భర్త ప్రసాద్ లపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat