టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును నటుడు, బిగ్బాస్ విజేత కౌశల్ కలిశారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కౌశల్ కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్ను తనవెంట తీసుకొచ్చి చంద్రబాబుతో సమావేశపరిచారు. టీడీపీతో కలసి పనిచేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి కౌశల్ సిద్దమయినట్టు తెలిపారు. త్వరలోనే తన భవిషత్తు కార్యాచరణను ప్రకటిస్తానని సీఎంకు కౌశల్ చెప్పారు. అయితే కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొందరు గతంలో కౌశల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ గత కొద్ది రోజులుగా కౌశల్ ఆర్మీ సభ్యులు ఇతనికి ఎదురు తిరుగుతున్నారు. క్యాన్సర్ ట్రస్ట్ పేరిట ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. త్వరలోనే తన భవిషత్తు కార్యాచరణను ప్రకటిస్తానని సీఎంకు కౌశల్ చెప్పారు. అయితే కౌశల్ కలయికపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. “పుతిన్ గారూ.. మా ఏపీ దేశానికి ఆర్మీని పెట్టేసుకున్నాం.. ఆర్మీ చీఫ్ కౌశల్ అని చాలా పెద్ద బిగ్ బాస్.. రేపోమాపో సార్వభౌమాధికారాన్ని కూడా ప్రకటించేస్తాం.. మా కరెన్సీపై ఆ మహానాయకుడు బొమ్మే.. అన్నట్టూ, 5 మిగ్ 21లు, 5000 ఏకే-47లు, 5 బ్రహ్మోస్, 2 సబ్ మెరైన్లు పంపించండి సార్.. యుద్ధనౌక జిన్ పింగ్ ఇస్తానన్నాడు.. డబ్బులా.? మోడీ బడ్జెట్ బకాయిలు, కేసీయార్ కరెంటు బకాయిలు ఇవ్వగానే సీఎం రమేష్, శివాజీలతో పంపించేస్తా.. సొంత రాజ్యాంగమా.? కేఏ పాల్, చలసానితో రాయిస్తున్నా.. కరెన్సీ ప్రింటింగ్ ఆంధ్రజ్యోతికి కంట్రాక్టుకిచ్చాం, పర్లేదు, మనోడేలే అంటూ కౌశల్ ఆర్మీ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు.
