ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి విజయనగరం జిల్లా పర్యటనకు ఈరోజు ఉదయం వెళ్లారు. జిల్లాలోని భోగాపురంలో మంత్రికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభావేదికపైకి ఎక్కువ మంది రావడంతో వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. భద్రతా సిబ్బంది, వైసీపీ నేతలు అప్రమత్తం కావడంతో మంత్రితో పాటు సభావేదికపై ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
