ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేటి (శుక్రవారం) ఉదయం 12.22 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇప్పటికే స్పష్టం చేశారు. వైసీపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. నవరత్నాల పథకాలతోపాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రాష్ట్ర తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. కాలయాపన లేకుండా మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు ఈ కింద విధంగా ఉండే అవకాశముంది
వ్యవసాయానికి రూ. 28,886 కోట్లతో బడ్జెట్ రూపకల్పన
నవరత్నాల అమలుకు బడ్జెల్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు
వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ. 18,000 కోట్లు, అమ్మఒడికి రూ. 6,500 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8,500 కోట్లు
గృహనిర్మానానికి రూ. 8వేల కోట్లు, జలవనరులకు రూ. 12వేల కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 12వేల కోట్లు కేటాయింపు
పాఠశాలలో మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లే
ఆస్పత్రులకు మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లు
పంటల బీమాకు రూ. 2,163 కోట్లు కేటాయింపు అవకాశం
విపత్తుల నిర్వహణ నిధికి రూ. 2వేల కోట్లు కేటాయించే అవకాశం
ధరల స్థిరీకరణ నిధి రూ. 3లే కోట్లు, విద్యుత్ రాయితీకి రూ. 5వేల కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయింపులు చేసే అవకాశం