Home / ANDHRAPRADESH / అందుకే నిన్ను భీమవరంలో ఓడించాం.. అయినా నువ్వు ఏమాత్రం మారలేదు పవన్

అందుకే నిన్ను భీమవరంలో ఓడించాం.. అయినా నువ్వు ఏమాత్రం మారలేదు పవన్

తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.. భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని సీఎం జగన్ ను కోరారు. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం చేయొద్దన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను నిలిపివేయడం వెనుక ఏదో కోణం ఉందనే అనుమానం ఉందని, పునరావాసం ఇవ్వకపోవడంతో నేడు వరదలతో ముంపు బారిన పడ్డారన్నారు.. కానీ అది చేసింది చంద్రబాబు అని మాత్రం విమర్శించలేదు. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం జరిగిన అవినీతి వెలికితీస్తుందటే అందుకు 20 వేల మంది ఉపాధి దెబ్బతీశారని విమర్శించారు. అమరావతి కాంట్రాక్టులు ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా పోటీ పట్ల నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రత్యేకహోదా ఉద్యమం విషయంలో ప్రజల్లో ఆవేశం, కోరిక లేకపోతే తాను ఏమీ చేయలేనన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు హోదా కోసం ఎంతకైనా నిలబడతానని, తన ఒక్కడి ఆరాటం – పోరాటం సరిపోదన్నారు. తానొక్కడే ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్టు మాట్లాడారు. అలాగే వైఎస్ జగన్ కాపుల రిజర్వేషన్ పట్ల రాజకీయ ప్రయోజనాలు చూసి మాట్లాడినట్లుందన్నారు. కానీ జగన్ ఏనాడూ కాపుల్ని బీసీల్లో చేరుస్తాననే హామీనివ్వలేదు. పవన్ మాట్లాడిన ప్రతీ మాట తెలుగుదేశం కార్యకర్త మాట్లాడినట్టుందని భీమవరం ప్రజలు మండిపడుతున్నారు. ఇలా వ్యవహరించినందుకే గత ఎన్నికల్లో ఓడించామని చెప్పుకొచ్చారు. అవినీతి పై పోరాటం అంటూ అరిచే పవన్ కళ్యాణ్ కనీసం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తుంటే పవన్ కి ఎందుకంత ఉలికిపాటని ప్రశ్నిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat