పురుగుల మందు తాగానంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నేత ఆడిన డ్రామా బెడిసికొట్టడంతో చివరికి అబాసు పాలయ్యారు. గుమ్మగట్ట టీడీపీ నేత జయరామిరెడ్డి సోమవారం పురుగుల మందు డబ్బా పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. పురుగుల మందు తాగానంటూ రెవెన్యూ అధికారుల వద్ద డ్రామాకు తెరలేపారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు బళ్లారి తరలించారు. జయరామిరెడ్డి పురుగుల మందు తాగలేదని బళ్లారి వైద్యుల రక్తపరీక్షలో వెల్లడయ్యింది. జయరామిరెడ్డి నాటకం ఆడారనే అనే వాస్తవం వెలుగు చూసింది. ప్రభుత్వ స్థలాన్ని సొంతం చేసుకునేందుకే ఆయన ఆత్మహత్యాయత్నం నాటకం ఆడినట్లు తెలుస్తోంది.
