Home / ANDHRAPRADESH / తన భార్య టీచరమ్మతో…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో..భర్త పైశాచికత్వం

తన భార్య టీచరమ్మతో…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో..భర్త పైశాచికత్వం

పెళ్లయిన కొద్దికాలానికే భర్త నిజస్వరూపన్ని బయటపెట్టి సెంట్రల్ జైలుకి పంపిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్‌లోని గాడి కాలనీలో నివాసం ఉంటోంది. ఇల్లు పాడవడంతో మరమ్మతుల కోసం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఆకుల అనంత్ అచ్యుత్ కుమార్ అనే తాపీమేస్త్రీని సంప్రదించింది. ఆమె ఇంట్లో పని చేసేందుకు ఒప్పుకున్న అచ్యుత్.. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు.

చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి విధి వంచనకు గురైన టీచర్.. అతని మాటలు నమ్మింది. దీంతో అచ్యుత్ రోజూ ఆమె ఇంటి వచ్చి వెళ్లేవాడు. అనంతరం 2019లో అచ్యుత్ అమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దికాలానికే ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. అతని వేధింపులు భరించలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. వేధిస్తున్నాడని అచ్యుత్‌పై పాడేరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.

వేధింపుల కేసు పెట్టడంతో మరింత రెచ్చిపోయన అచ్యుత్ ఉన్మాదిగా మారి పెళ్లి అనంతరం ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బెదిరించడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలు, ఫొటోలను వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో సదు టీచర్ పాడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అచ్యుత్‌ను అరెస్టు చేశారు. సెక్షన్ 498A 67,332,353 కింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat