ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతిపనికీ డబ్బులు పీక్కుతినే దళారుల వ్యవస్థ లేదు.. రోజుల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. వేలకు వేలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. అవినీతి, అక్రమాలు జరగడానికి ఆస్కారమే లేదు.. అంతకుమించి కిలోమీటర్ల దూరం ప్రయాణించకుండా సొంత ఊరిలోనే పనులు జరగడం చూసి అసలు ఇది కలా.? నిజమా.? అని రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారు.
