ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019 లో భాగంగా రాజమండ్రిలో దిశా పోలీస్ స్తేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే .సీఎం జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ లో ఏకంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రాజమండ్రి సిటీ టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాతో తమపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నవారి మీద చర్య తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే భవానికి మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, మహిళా కార్యకర్తలు పోలీస్స్టేషన్కు వెళ్లారు.అయితే దిశ చట్టం అమలులోకి రాలేదని పోలీసులు అంటున్నారని భవాని చెప్పారు. అసెంబ్లీలో మద్యం అంశం పై మాట్లాడినందుకు కొందరు అసభ్య వ్యాఖ్యలు చేశారని, స్పీకర్ కు పిర్యాదు చేసినా చర్య తీసుకోవలేదని ఆమె ఆరోపించారు.
