ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.తాను ,తన భర్త పరీక్షిత్ రాజు తమ జీవితాంతం జగన్ తోనే ఉంటామని అన్నారు. తమ కట్టె కాలిపోయేవరకు జగనే తమ నాయకుడని అన్నారు. తాను గిరిజన స్కూల్లో నేల మీద కూర్చుని చదువుకున్నానని , ఇప్పుడు గిరిజన శాఖ మంత్రిని చేయడమే కాకుండా, తనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి పక్కన కూర్చునే గౌరవం ఇచ్చారని,ఇది జీవితంలో మర్చిపోలేని సన్నివేశమని, తాను ,తన భర్త ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటామని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉంటే తాము ప్రతిపక్షంలో ఉన్నామని, అదికారంలో ఉంటే అదికారపక్షంలో ఉన్నామని, భవిష్యత్తులో జగన్ రాజకీయాలలో ఉన్నంతవరకే తాము కూడా రాజకీయాలలో ఉంటామని, ఆయన రాజకీయాలు మానితే తాము కూడా మానివేస్తామని శ్రీవాణి ప్రకటించారు.
