ఏపీలో ప్రస్తుతం అదికారా పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట.
తాజాగా ఈ రోజు కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని తాడూరు గ్రామములో వైసీపీ ఎమ్మెల్యే బుగన్న రాజేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వైసీపీలో కి 100 మంది చేరడం జరిగింది. వారంత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన నచ్చక ..వైఎస్ జగన్ మా పేద ప్రజలకు న్యాయం చేయగలడని నమ్మకంతోనే వైసీపీలోకి చేరినట్లు తెలిపారు.ఇంకా ఎన్నికల సమయానికి మరికొంతమంది చేరుతారని వారు ఎమ్మెల్యే బుగన్న రాజేంద్రనాథ్ రెడ్డి తో చేప్పినట్లు సమచారం.