ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైయస్ఆర్సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైసీపీలోకి వచ్చారు. లోటస్పాండ్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. నటులు పృథ్విరాజ్, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పృథ్వి మాట్లాడుతూ చంద్రబాబు చివరికి దోచుకోవడానికి ఏమిలేక ఓట్లు కూడా దోచుకుంటున్నారని, వీధి నాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను, వైఎస్సార్సీపీ పధకాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
