కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి మరో పదవి లభించింది. ఇప్పటికే వైసీపీ లోక్సభ పక్షనేతగా నియమితులైన మిథున్రెడ్డిని తాజాగా లోక్సభ ప్యానల్ స్పీకర్ పదవి వరించింది. మిథున్రెడ్డిని లోక్సభ ప్యానల్ స్పీకర్గా నియమిస్తూ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్సభకు అధ్యక్షత వహిస్తారు. రాజంపేటలో లోక్సభ నియోజకవర్గం నుంచి మిథున్రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. 2014లోతొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
