ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్యా’అని సంభోదిస్తూ జగన్ ని తుగ్లక్ తో పోలుస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకి వెంకన్న ట్వీట్ ఏంటో క్రింద చూడండి.
420 తాతయ్యా @VSReddy_MP గారూ, మీ తుగ్లక్ @ysjagan గారికి ఇంత అభద్రతాభావం ఉందని ఊహించలేదు. ఈ నిర్బంధాలు, మీడియా ఆంక్షలు నీ సలహానే కదా! 6 నెలల్లో మంచోడిని అనిపించుకుంటా అన్నాడు, 100 రోజులకే చేతులెత్తేశాడు. అయినా మీకు తెలిసింది ముంచడం ఒకటే కదా, ఇంకా మంచి ఎక్కడుంటుంది @YSRCParty !
— venkanna_budda (@BuddaVenkanna) September 11, 2019