రేపు నవంబర్ 4 సోమవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కార్తీకమాసంలో శ్రవణం రోజున కోటి సోమవారం పండుగ రావడం మిక్కిలి విశేషం. రేపు సోమవారం ఉదయం దగ్గరల్లోని శివాలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుని, ఉపవాసం ఉండాలి. మళ్లీ సాయంత్రం ప్రదోష కాలమందు ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని, మళ్లీ శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని దీపారాధన చేయాలి. తదనంతరం రాత్రి భుజిస్తే కోటి సోమవారాలు ఉపవాసమున్న పుణ్య ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఈ కోటి సోమవారం వత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. శ్రవణం రోజున కోటిసోమవారం పండుగ రావడం. చాలా అరుదైన విషయం కావున రేపు నిష్టతో పగలంతా ఉపవాసం ఉండి, పూజలు చేసి ఈశ్వరుడి పాత్రులు కాగలరు.