Home / ANDHRAPRADESH / శభాష్ సీఎం జగన్..ఆర్ నారాయణమూర్తి

శభాష్ సీఎం జగన్..ఆర్ నారాయణమూర్తి

ఆంధ్రప్ర‌దేశ్‌లోని పాఠ‌శాల విద్యారంగంలో తెలుగు మాధ్య‌మంపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో పెద్ద చ‌ర్చ‌ జరుగుతోంది. కొందరు నేతలు వ్యతీరేకిస్తేంటే..మెజారిటీ ప్రజలు, యువకుల, రాజకీయ నేతలు స్వాగాతిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టిన నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారని, ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని ఆయన అన్నారు.

కాకినాడ సమీపంలోని నడికుదురులో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు. తనకు ఎదురవుతున్న సమస్యలు, తాను అనుభవించిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో తాను నిర్మించిన ‘ఎర్రసైన్యం’ చిత్రంలో ఇంగ్లీషు చదువులు లేక వెనుకబడిన తరగతుల వారు ఎలా నష్టపోతున్నారో చర్చించానని అన్నారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆంగ్ల విద్య తప్పనిసరని నారాయణమూర్తి పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat