ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్కు వెళ్లి సీఎంకు రాఖీలు కూడా కట్టారు. మహిళల భద్రతకోసం ఏపీ దిశ యాక్ట్ పేరుతో చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, చిన్నపిల్లల లైంగిక వేధింపులను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన దిశ చట్టాన్ని చేసినందుకు సంతోషం వ్యక్తంచేశారు. జగన్ను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజా మహిళా ఎమ్మెల్యేలున్నారు. గురువారం మహిళల భద్రతకు సంబంధించి ఆంధప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు-2019 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదంతెలిపింది. ఈబిల్లు చట్టరూపం దాలిస్తే మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష పడుతుంది.
కేసుకు సంబంధించి సరైన ఆధారాలుంటే అత్యాచార కేసుల దర్యాప్తును వారంరోజుల్లో పూర్తిచేయడంతోపాటు 14రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేస్తారు. 21రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి.. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈకోర్టుల్లో విచారణ జరుగుతాయి. మహిళలను కించపరుస్తూ సోషల్ విూడియాలో అసభ్య పోస్టులు పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారుల పై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాలప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష పడుతుంది. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి జీవిత ఖైదు విధించే అవకాశం కూడా ఉంది.