Home / ANDHRAPRADESH / ఏపీలో ‘5 కేజీల మటన్‌ కొన్న వారికి హెల్మెట్‌ ఉచితం’

ఏపీలో ‘5 కేజీల మటన్‌ కొన్న వారికి హెల్మెట్‌ ఉచితం’

కోవిడ్‌–19 (కరోనా వైరస్‌) దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్‌ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో కొందరు వ్యాపారులు వారి ఆలోచనలకు పదునుపెట్టి ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతానికి చెందిన ఓ మాంసం వ్యాపారి ‘5 కేజీల మటన్‌ కొన్న వారికి హెల్మెట్‌ ఉచితం’ అంటూ ఆదివారం ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించాడు. దీంతో అతని వద్ద విక్రయాలు జోరుగా సాగాయి. కాగా, కోవిడ్‌–19కు చికెన్‌కు సంబంధం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్, గుడ్లతో ఈ వైరస్‌ సోకుతోందని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పౌల్ట్రీ ఫెడరేషన్‌ ఖండించింది. చికన్‌, గుడ్లు కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat