‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్లో ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి విన్నవించారు.
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9440795567కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజా దర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిచట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ గోపీనాథ్జట్టి తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ షేక్షావలీ, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వినోద్కుమార్, రామచంద్ర, సీఐలు రామానాయుడు, డీసీబీఆర్ బి.శ్రీనివాసులు పాల్గొన్నారు.