దాదాపు 37,000.. తెలుగునేలపై దేవాలయాల సంఖ్య. దేవుడికి అందరూ సమానమే. మనకు దేవుళ్లందరూ సమానమే. కానీ ప్రభుత్వానికి మాత్రం కాదు. ఆదాయం బాగా సంపాదించే దేవుడికి ఘనంగా ధూపదీప నైవేద్యాలు.. సకల సేవలు! కానీ.. ఆ దేవుడు పైసా సంపాదించకపోతే గుడిలో దీపానికీ దిక్కుండదు. సుమారు 82,00,000.. మంది బ్రాహ్మణులు. వీరిలో 60 శాతం దారిద్య్రరేఖకు దిగవనున్నారు. 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. 69 శాతం మందికి సొంత ఇళ్లు లేవు. చాలామందికి తెల్లరేషన్ కార్డులు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదు.
బ్రాహ్మణులకూ.. బాబు ‘పోటు’ :
1987లో తెలుగుదేశం ప్రభుత్వం హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సృష్టించింది. పొరపాటు గుర్తించి సర్దుకునేలోపే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. అనంతరం ఆ చట్టాన్ని మరింత కఠినతరం చేసి అర్చకులకు రిటైర్మెంట్ వంటివి పెట్టి గెంటేసే ప్రయత్నం చేశాడు. టీడీపీ హయాంలో 32 వేల దేవాలయాలు మూతపడ్డాయి. ధర్మ రక్షణకు.. వైఎస్ కృషి వైఎస్ రాజశేఖరరెడ్డి హిందూ సమాజానికి ఎంతో మేలు చేశారు. ధార్మిక రక్షణ ప్రాముఖ్యతను గుర్తించారు. ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ ధర్మాదాయ చట్టానికి 2007లో సవరణలు తెచ్చారు. దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. 25 వేల దేవాలయాలను పునరుద్ధరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బ్రాహ్మణుల సంక్షేమానికి బాటలు వేశారు. వైఎస్ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
దేవాలయ వ్యవస్థను కుప్పకూల్చిన చట్టం :
దేవాలయాలకు సంబంధించి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం చల్లా కొండయ్య కమిషన్ వేసింది. దేవాలయాలు బ్రాహ్మణులు జీవించడం కోసం పెట్టుకున్నవేనని కమిషన్ నివేదికను ఎన్టీఆర్ నమ్మారు. ఈ నేపథ్యంలోనే 1987లో దేవాదాయ ధర్మాదాయ చట్టం తీసుకొచ్చారు. ఇది ఆలయాల్లో అర్చక బాధ్యతలకు వంశపారంపర్య హక్కును తొల గించింది. హారతి పళ్లెంలో వచ్చే చిల్లరను కూడా అర్చకులు తీసుకోవద్దని శాసించింది. అర్చకులకు ఆలయాల్లో భక్తులు ఇచ్చే సంభావనలను అడ్డుకుంది. వాటిని హుండీ లో వేయించింది. అర్చకులు ఎక్కడ ఓ రూపాయి కోసం ఆశపడాతారోనన్న అనుమానంతో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చట్టం తమ జీవితాలను చిందరవందర చేసిందని అర్చకులంతా ఎన్టీఆర్కు మొరపెట్టుకున్నారు. వాస్తవం గుర్తెరిగి అర్చకుల న్యాయమైన డిమాండ్లను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఎన్టీఆర్ వేశారు. 1995 ఆగస్టు 15న ఏర్పడిన ఈ కమిటీ నివేదిక సమర్పించే సమయానికి ఎన్టీఆర్ను దించేసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పరిస్థితి మరింత దారుణమైన స్థితికి చేరుకుంది.
గుడిగంటే.. ఉరికొయ్య :
చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అర్చకులు, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు. 2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్మెంట్ స్కీంను పెట్టారు. జీతాలు లేవు… పెన్షన్లు లేవు… రిటైర్మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది. దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001, సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వైఎస్ రాకతో మారిన పరిస్థితి :
వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు. చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా అర్చకులు వైఎస్సాఆర్ను ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా. ఈ హామీతో వైఎస్సాఆర్కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు. అర్చక వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దానిద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు విద్య గృహనిర్మాణానికి రుణాలు అందజేశారు గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ.లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు కామన్గుడ్ ఫండ్ను ఏర్పాటు చేసి దేవాలయాల పునరుద్ధరణకు శ్రీకారంచుట్టారు.
ధార్మిక పరిషత్తో..:
వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి అర్చకులకు వేతనాలు అందించాలని చెప్పారు. 33/2007 సెక్షన్-ఎ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక బ్యాంకు ఏర్పాటు చేసి వేతనాలు అందించాలని చట్టాన్ని సవరించారు. అందరు ఎమ్మెల్యేలను ఒప్పించి మరీ ఈ చట్టాన్ని ఆమోదింపచేశారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు సేవా టిక్కెట్లలో వాటా, హుండీల్లో వాటా ఉండాలని చెప్పారు. దేవాలయాల్లోని ధర్మకర్తల మండలిలో అర్చకులకు స్థానం కల్పించారు. గ్రామాల్లో వర్షాలు పడాలన్నా… రైతుల జీవితాలు బాగుపడాలన్నా గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పూజలు కొనసాగాలని, అలా ఉండాలంటే అర్చకుల జీవితాలు బాగుపడాలని వైఎస్ ఆకాంక్షించారు. ఆ మేరకు ఐదు వేల దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కింద ప్రతి అర్చకునికి నెలకు రూ. 2,500 చొప్పున వేతనం అమలుచేశారు. అయితే ప్రస్తుతం ఈ వేతనాన్ని ఐదు ఎకరాల భూమి ఉన్న దేవాలయాల్లోని అర్చకులకు నిలిపివేశారు. దీంతో ఆయా కుటుంబాలన్నీ నానా ఇబ్బందులు పడుతున్నాయి.
`సర్వేజనా సుఖినోభవంతు’ అని అందరి మంచి కోరుకునేది ఒక్క మన బ్రాహ్మణ సామాజికవర్గం మాత్రమే అన్న నా అభిప్రాయాన్ని కాస్తా 2004లో డా॥వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మార్చుకోవలసి వచ్చింది. ఎందుకంటే కుటుంబంలో పిల్లల కోసం తండ్రి తాపత్రయపడే రీతిలో మహానేత వైయస్ ఆంధ్రరాష్ట్ర ప్రజలకోసం పరితపించిన ఏకైక ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రజా ప్రయోజన పథకాలను అమలుపరుస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అందరి మంచి కోరుకున్న ఆయన పంచభూతాల సాక్షిగా మహనీయుడయ్యాడు. ఏది ఏమైనా ఈ బ్రాహ్మణుడి ఆశీస్సులు, దీవెనలు, వై.ఎస్. జగన్ వెంటే! ఎందుకంటే రెడ్డి రాజులకాలంలో కనకాభిషేకం అందుకున్న శ్రీనాథుడు తర్వాతి కాలంలో వ్యవసాయాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. బ్రాహ్మణుడు ఈ రాష్ర్టంలో తను సుఖసంతోషాలతో ఉంటూ యితరుల సుఖ సంతోషాలు కోరుకుంటూ ఉండాలంటే జగన్మోహన్రెడ్డి పరిపాలన రావాలి.
– పోతావఝల పురుషోత్తమ శర్మ, తెనాలి
అర్చక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసిన వైఎస్.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అర్చక సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. అర్చకుల కుటుంబాలకు వైద్యం, విద్య, గృహనిర్మాణం వంటివి సమకూర్చేందుకు శ్రీకారం చుట్టారు. అర్చకుల ధూప, దీప, నైవేద్యాలకు కూడా ఈ నిధులతోనే వెసులుబాటు కల్పించారు. ఆయన మరణం తర్వాత ఈ అసోసియేషన్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసాయం లేదు. వైఎస్ పథకాలకు మోక్షం కలగాలంటే అది జగన్మోహన్రెడ్డికే సాధ్యం.
– ఎం.ఉమామహేశ్వరరావు, చుండూరు.