మంత్రి గంటా శ్రీనివాస్ వియ్యంకుడు మంత్రి నారాయణ స్థాపించిన నారాయణ విద్యా సంస్థలతోపాటు చైతన్య కళాశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకంటే తమకు ఏదీ ముఖ్యం కాదని, అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాగా, ఈ రోజు మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖ పరిధిలోగల నారాయణ, చైతన్య హాస్టల్స్ను తనిఖీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 38 మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారని, అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 158 కాలేజీ హాస్టల్స్కు అనుమతులు లేవన్నారు. నిబంధనలు పాటించకుంటే శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల యాజమాన్యాలనూ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
