కాపులకు చంద్రబాబు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్న చంద్రబాబు కాపులకు మరో ద్రోహానికి ఒడిగట్టారు. కాపు కార్పొరేషన్ను బీసీ సంక్షేమశాఖకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కాపు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కాపు కార్పొరేషన్ ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో కాపుకార్పొరేషన్ ఎండీని తొలగిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్ ఎండీ అమరేంద్రకుమార్పై వేటు పడింది. అమరేంద్రను సొంత పశుసంవర్ధకశాఖకు సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్ బాధ్యతలను బీసీ సంక్షేమశాఖ సెక్రటరీకి అప్పగించింది. అయితే, గతేడాది మరేంద్రకుమార్ డిప్యూటేషన్పై కార్పొరేషన్కు వచ్చారు. ఇప్పటికే అమరేంద్ర అక్రమాలపై రిటైర్ ఐఏఎస్తో విచారణ కొనసాగుతోంది.
