రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం 5.15గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం అయన ఉదయం 11గంటలకు గవర్నర్ నరసింహన్ను పరామర్శిస్తారు. ఇటీవలే గవర్నర్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తరువాత మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
