ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే నా కోరిక. మళ్లీ చదువుల విప్లవం తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. ప్రస్తుతం రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారింది. అవినీతిపరులను జైల్లో పెట్టి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మార్చాలన్నదే నా కసి. ఇవన్నీ చేసేందుకు దేవుడి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నాకు కావాలి. సమస్యలపై పోరాడేందుకు నాకు మద్ధతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి తాను కాసులకు కక్కుర్తి పడనని, కేసులు అంటే భయపడనని తనకు ఉంది కసి మాత్రమేనని, అది రాష్ట్రాభివృద్ది చేయాలన్న కసి.ప్రత్యేక హోదా తేవాలన్నా కసి ఉందని ఆయన అన్నారు. అదికారంలోకి వచ్చాక మూడు,నాలుగేళ్లలో మద్యపానం తీసివేయాలన్నది తన కసి అని , పీజ్ రీయింబర్స్ మెంట్ ద్వారా బీదలకు చదువు అవకాశం ఇవ్వాలన్నది తన కసి జగన్ అన్నారు.ప్రతి పేదవాడికి మంచి చేయాలని, తాను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో తన పోటో పెట్టుకునేంత మంచి చేయాలన్న కసి ఉందని ఆయన అన్నారు.అవినీతి ఆంద్రప్రదేశ్ గా చంద్రబాబు మార్చారని, అబివృద్ది ఆంద్రప్రదేశ్ గా మార్చాలన్నది తన కసి అని జగన్ అన్నారు.
