ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని విమర్శించారు హైదరాబాద్లో శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యాపారం మానేశానని, వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెబుతారు. కానీ చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు వ్యాపారాలు చేయడం నిజం కాదా. దీంతో పాటు చంద్రబాబు తన తల్లి పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నా.. వ్యాపారాలతో తనకు సంబంధం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయాలన్న ఆలోచన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేదని, అది కేవలం చంద్రబాబు నైజమని పేర్కొన్నారు. అందుకే కేసుల్లో ఇరుక్కోవడమే ఆలస్యం స్టేలు తెచ్చుకునే అలవాటున్న నేత చంద్రబాబు ఒక్కరే అని నాని అన్నారు.
