ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 94 రోజులుకు పైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం తిమ్మపాలేం నుండి ప్రారంభించిన జగన్ కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు 94వ రోజు పాదయాత్రను ముగించారు. అయితే ఈ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ఓ చిన్నారి డబ్బులు దాచుకున్న హుండీని కానుకగా ఇచ్చింది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో ఓ చిన్నారి తన తండ్రితో పాటు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని తాను ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బును వైఎస్ జగన్కు విరాళంగా ఇచ్చింది. ఆ చిన్నారి చూపిన ప్రేమకు వైఎస్ జగన్ మంత్రముగ్ధుడై ఆమెను ఆప్యాయంగా ముద్దాడి ఆశీర్వదించారు.
