Home / ANDHRAPRADESH / పాదయాత్రలో ఆసక్తికర సంఘటన “జగన్ ఫిదా”..ఫేస్ బుక్ పేజీలో పోస్ట్..!

పాదయాత్రలో ఆసక్తికర సంఘటన “జగన్ ఫిదా”..ఫేస్ బుక్ పేజీలో పోస్ట్..!

ప్రజాసంకల్పయాత్రలో 145వ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.పాదయాత్రలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే పాదయాత్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఆ విషయాన్ని వైఎస్ జగన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజీలో – ” కొన్ని జ్ఞాపకాలు గుండెల్లో ఎంత బలంగా ముద్రవేసుకపోతాయో పాదయాత్రలో ఓ అనుభవం పట్టిచూపింది. చేతిలో పలకపట్టుకొని ఓ ఏడేళ్ళబాలుడు తన తండ్రితో పాటు నన్ను కలిశాడు. ఆ పలక మీద వైయస్సార్ అని అక్షరాలు కనిపించాయి. ఆసక్తి కలిగి ఏంటా అని ఆరా తీసాను. ఆశ్చర్యపోవడం నా వంతయింది”.

“ఐదేళ్ల కిందట ఆ చిన్నారి నషీర్ తో అక్షరాభ్యాసం చేయిస్తూ నేను దిద్దించిన అక్షరాలట. అప్పుడు అఆ లు దిద్దించబోతే వారించి మరీ వైఎస్సార్ అని దిద్దించుకున్నారు. పలకపై అక్షరాలు చెరిగిపోనివ్వకుండా ఐదేళ్ల తరువాత మళ్లీ తెచ్చి చూపించడం ఆనందాన్ని కలిగించింది. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ చిన్నారిని ఆశీర్వదించాను. పలకపై వైఎస్సార్ అక్షరాలను, హృదయపలకపై నాన్నగారి ప్రేమను భద్రపరచుకున్న విస్సన్నపేట తండ్రికొడుకులకు శుభకాంక్షలు తెలిపి ముందుకి నడిచాను” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. నిజంగా జగన్ ఫ్యామీలీ అంటే ఏంత అభిమానం ఉంది తెలుగు ప్రజల్లో అని తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat