పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు గెలిచిందని ఆ పార్టీ అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి 2014 లో వైసీపీ పార్టీ ఈ జిల్లాలో గెలవవలసి ఉందని, కాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు అనుభవం లేదని, పరిణితి లేదని తెలుగుదేశం అదినేత చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఓట్లు చీలకుండా తాను గత ఎన్నికలలో పోటీ పెట్టలేదని అన్నారు. టీడీపీ నేతలు తెలుసుకోవలసింది తాను ప్రజల సంక్షేమానానికి గాని, టీడీపీ సంక్షేమానికి కాదని అన్నారు. 2014 నుంచి తాను టీడీపీ తప్పుల గురించి చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి అంతా అమరావతిమేదేనని,అక్కడ ఎలా సంపాదించాలన్నదానిమేదేనని ,అంతే తప్ప పశ్చిమగోదావరి జిల్లా యువత పై లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.తెలుగు తమ్ముళ్లు ఎంత తిట్టినా, తాను బంతిలా పైకి లేస్తానని ఆయన అన్నారు.
