జనసేన పార్టీ పుట్టిక నుంచి కష్టపడుతున్న వారు నిరాశకు గురవుతున్నారని తిరుపతికి చెందిన రాజేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం లభించడమే కాకుండా పదవులూ కూడా దక్కుతున్నాయని ఆరోపించారు.ఆ పార్టీనేత పసుపులేటి హరిప్రసాద్ పీలేరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
సిఎం పదవి కోసం కాకుండా రాష్ట్రంలోని పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో తమ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన రాకతోనే అనేక సమస్యలకు సమాధానం దొరికిందని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా మారి 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా ముందునుండి ఉన్ననేతలకు ప్రాధాన్యం లేదని రాజేష్ యాదవ్ మాట్లాడడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఇలాలంటివి పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని, బహిరంగ సభల్లో చెప్పడం సరికాదని హరిప్రసాద్ వారించారు. దీంతో వీరిద్దరి అనుచరుల మధ్య గొడవ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపించడంతో వేదికపైనున్న ఇతర నాయకులు రాజేష్కు సర్దిజెప్పారు.
