అతివేగం ప్రమాదకరం….ఇది ఎక్కడైనా చూసారా? ప్రతి వాహనంపై ఇదే ఉంటుంది…కాని దినిని ఎవరు పాట్టించారు,కాగా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలు కొనితేచ్చుకుంటారు.నిన్న హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ సంఘటన జరిగిన గంటల్లోనే మరొక ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా, కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహనంపై వస్తున్న హరినారాయణరెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులను ఎమ్మెల్యే వాహనం వేగంగా ఢీ కొందని చెబుతున్నారు.సీతామహాలక్ష్మీ అక్కడికక్కడే చనిపోగా, నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఎమ్మెల్యే కారు అతివేగంగా నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.అతివేగమే ఇ నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే రామారావును తన గన్ మెన్ బయటకు తీసి ఆటోలో ఎక్కించి విమానాశ్రయానికి పంపించారని సమాచారం.పోతుల రామారావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి తెలుగుదేశంలోకి పిరాయించిన ఎమ్మెల్యే.
