రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతుందంటూ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా తెలుగు రాజకీయాల్లో ఈ విషయమే హాట్ టాపిక్గా మారింది. అటు మీడియా,ఇటు రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా కాంగ్రెస్,టీడీపీ పొత్తుపై తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో స్ధాపించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని కొంతమంది అంటున్నారు. అంతుకాదు కాంగ్రెస్ సిద్ధాంతాలు కు వ్యతిరేకం గా పుట్టిన పార్టీ ఆరోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అన్న స్వర్గియ నందమూరి తారకరామరావు తెలుగు దేశం పార్టీ స్థాపించాడు. కాని ప్రస్తుత టీడీపీ నేతలు ఆయన ఆత్మగౌరవం దెబ్బతినేలా ..తెలుగు వాడి నమ్మకాన్ని తుడిచేస్తున్నారు. నిజం గా ఇలాంటి అనైతికమైన చర్యల మీ తమ్ముళ్ల కి సునకనందం కలిగించ వచ్చేమో కానీ ఇది ఒక బ్రోకర్ పార్టీ గా చరిత్ర పుటల్లో నిలిచి పోతుందని సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఎందుకంటే .2012 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పడి పోకుండా కాపాడి రాష్ట్ర విభజన కు కారణమై ఈ రోజు ఆంధ్ర ఉన్న పరిస్థితి కి కారణమయ్యారు. ఓట్లు చీల్చడం కోసం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జైసమైక్యాంద్ర పార్టీ పెట్టించి లాస్ట్ లో వారి ఓట్లు అన్ని టీడీపీ ఖాతా లో వెయుంచుకొని మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఈ సారి కూడ డైరెక్ట్ గా తెలంగాణ లో ,ఇండైరెక్ట్ గా ఏపీలో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ప్రజల్లో ఏహ్య భావం కలుగుతుందంటున్నారు రాజకీయ విశ్లషకులు .మీ పార్టీ మనుగడ కోసం మీరు అధికారం పంచుకోవడం కోసం కేసు ల నుండి బయటపడడం కోసం(కేంద్రం లో కాంగ్రెస్ వస్తే) సిద్ధాంతాలు నైతికత గాలికి వదిలి మీరు చేస్తున్న ఈ చర్య 1995 చర్య కంటే అతి జుగుప్సాకర చర్య అని అబిప్రాయ పడుతున్నారు.
