ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు,రాష్ట్ర విభజన కష్టాలు.. ఒకవైపు .. చంద్రబాబు చేస్తున్న పాలన మరోవైపు .. ఈ రెండింటి మద్యలో ఆంధ్రప్రదేశ్లోని సామాన్య ప్రజానికాన్ని ఆదుకునేందుకు, వారికి ఆపన్నహస్తం అందించేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమపథకాలు ఎండమావిలో పన్నీటి జల్లులా…కష్టాల కడలిలో చుక్కానిలా ఇప్పుడు కొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోహంలో వెలుగునింపుతోంది.జగన్ ఇచ్చిన భరోసాతో ప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా కలిగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే.. నిరుపేద, మధ్యతరగతి సామాన్య ప్రజలను ఆదుకునేందుకు, వారికి అడుగడుగునా అండగా ఉండేందుకు, వారి సంక్షేమం కోసం నవరత్నాలు పథకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాలు పథకానికి ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఏ నోటా విన్న ఈ పథకం గురించే చర్చ జరుగుతోంది. ప్రజాసంకల్పయాత్ర దారి పొడవునా.. నవరత్నాల గురించి వైఎస్ జగన్ ప్రతి బహిరంగా సభలో ప్రజలకు వివరిస్తూ వచ్చారు. దీంతో ఈ పథకం ప్రజల్లోకి విస్తృతం వెళ్లింది. ఈ పథకం వివరాలివి..
1. వైఎస్సార్ రైతు భరోసా
2. ఫీజు రీయింబర్స్మెంట్
3. ఆరోగ్యశ్రీ
4. జలయజ్ఞం
5. మద్యపాన నిషేధం
6. అమ్మఒడి
7. వైఎస్సార్ ఆసరా
8. పేదలందరికీ ఇళ్లు
9. పింఛన్ల పెంపు