కృష్ణా జిల్లా రాజకీయం రోజుకు రోజుకు వెడెక్కుతుంది. ఒక వైపు చేరికలు, మరోక వైపు నేతల టిక్కెట్ల వ్యవహారంతో టీడీపీ అయోమయంలో పడుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధా ఆదివారం భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్లో నానిని కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), మాజీ కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వంగవీటి రాధా.. వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. తిరిగి వైసీపీలో చేరుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
