ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి ఏవీ సుబ్బారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కర్నూల్ జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తన రాజీనామా లేఖ పంపినట్లు పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మైనేజింగ్ డైరెక్టర్కు ఏవీ సుబ్బారెడ్డి అందజేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం తనకు అప్పజెప్పిన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి బాధ్యతను 9 నెలలు నిర్వహించానని పేర్కొన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా తనకు సహకరించిన అధికారులకు, రైతులకు ఏవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
