ప్రస్తుతం దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కంటే కూడా ఏపి ప్రతిపక్షనేత చంద్రబాబుకే ఎక్కువ భద్రత ఉంది. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకు Zప్లస్ భద్రత కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్తం 74మంది సిబ్బందితో చంద్రబాబుకు 24గంటలు కాపలా ఏర్పాటు చేసింది. మొత్త బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, అత్యాధునిక రిమోట్ జామర్ వాహనం ఆయన కాన్వాయ్ లో ఉన్నాయి.. ఇదికాక కేంద్ర NSG కమాండోలు 16ఏళ్లుగా చంద్రబాబుకు కాపలా కాస్తున్నారు. రెండేళ్లక్రితం ఆయన అభ్యర్థన మేరకు వీరి సంఖ్యను కూడా కేంద్రంపెంచింది.
అమరావతి, నారావారిపల్లె, హైదరాబాద్ లలోని చంద్రబాబు నివాసాలు, ఫాం హౌస్ కూడా 24గంటలు పహారా ఉంటుంది. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఆయనకు సెక్యూరిటీ సేవలందిస్తారు. పొరుగున ఉన్న కర్ణాటక సిఎం కుమార స్వామి సెక్యూరిటీ సిబ్బంది కేవలం 50మంది. కేరళ సిఎంకు ఇంచుమించూ ఇంతే.. వీరిద్దరికి, తమిళనాడు, తెలంగాణా, మహారాష్ట్ర సీఎంలకు కూడా NSG రక్షణ లేదు. అయితే NSG కమాండోల భద్రత ఉన్న ఎల్కేఅద్వాని, ఛత్తీస్ గఢ్ మాజీ సిఎం రమణ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్, ఫరూఖ్ అబ్దుల్లా, గులాంనబీఆజాద్, మాయా వతి, ములాయం, అఖిలేశ్, అస్సాం సిఎం సర్బానంద సోనోవాల్ లస్థాయిలో చంద్రబాబుకు భద్రత కొనసాగుతోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు అసంతృప్తి ఏమిటంటే సీఎం గా ఉన్నప్పటిలా రోడ్ పై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ను నిలిపివేసి క్లియరెన్స్ ఇవ్వాలట.. ఆయన ముందు అడ్వాన్స్ ఎస్కార్ట్ పార్టీ ఉండాలట.. ఈరెండు లేవని చంద్రబాబు తన భద్రత గురించి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. 74మంది పోలీసులు 24గంటలు, బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు, రిమోట్ జామర్ వాహనం, కేంద్ర NSG కమాండోలు కూడా ఆయనకు సరిపోవడం లేదట.. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నా చంద్రబాబు కోసం రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు నియమించిన కమెండోల జీతభత్యాలు, వసతి, వాహనాల ఖర్చు అన్నీ కలిపి నెలకుకోటిన్నరకు పైగా అవుతోంది.