తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం వల్లన వేంకటేశ్వర స్వామి కానుకలతోటి ఆసుపత్రులు, అన్నదానాలు, గుడులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దరువు మీడియాధిపతి సిహెచ్. కరణ్ రెడ్డి పాల్గొన్నారు.
